గత సంవత్సరం లోక్ సభ నుంచి బహిష్కరించబడిన తర్వాత మరోసారి కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ తిరిగి మహువా మొయిత్రాను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈ సందర్భంగా మహువా మొయిత్రా మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కాషాయ పార్టీకి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. కేంద్రానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న సెలక్షన్ కమిటీ ద్వారా కమీషనర్లను ఎంపిక చేసినందున ఎన్నికల సంఘం “స్వాతంత్ర్యం కోల్పోయింది” అని మాజీ…
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ లోక్ సభ అభ్యర్థి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత అయిన మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విషయం సంబంధించి ఇదివరకే రెండుసార్లు సమన్లు పంపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈమెను విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. అలాగే…
Cash-For-Query Case: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సోదాలు నిర్వహించింది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మహువా మోయిత్రాకు మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మొయిత్రాను ఈడీ మార్చి 11న విచారణకు పిలిచింది. ఫిబ్రవరిలో ఫెమా కింద కేంద్ర దర్యాప్తు సంస్థ మొయిత్రాకు సమన్లు జారీ చేసింది. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే అదానీ గ్రూప్ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున మొయిత్రా బహుమతులు, డబ్బు…
Supreme Court : ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.
Mahua Moitra : టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు.
'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.