Mahua Moitra : క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ నేత, బహిష్కరణకు గురైన ఎంపీ మహువా మోయిత్రాపై లోక్పాల్ సీబీఐ విచారణకు ఆదేశించింది. మహువా మోయిత్రాపై ఐపీసీ 203(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని కోరింది. దీనితో పాటు ప్రతి నెలా దర్యాప్తు పురోగతిని లోక్పాల్కు తెలియజేయాలని కూడా సీబీఐని ఆదేశించింది.
Read Also:Virat Kohli-IPL Title: ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం: విరాట్ కోహ్లీ
నవంబర్ 2023లో సిబిఐ లోక్పాల్ ఆదేశాలపై పిఇ అంటే ప్రాథమిక విచారణను ప్రారంభించింది. నివేదికను లోక్పాల్కు సమర్పించింది. ఆ తర్వాత ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. మహువా మోయిత్రా పారిశ్రామికవేత్త హీరానందానీ నుండి డబ్బు తీసుకున్నారని.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని నిషికాంత్ దూబే ఆరోపించారు.
Read Also:Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఈ క్రమంలో ఇంకా కేసు నమోదు కాలేదని, లోక్పాల్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కేసు నమోదు చేయడానికి ముందు, DoPT ఒక ఉత్తర్వు జారీ చేసింది, ఆ తర్వాత CBI కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది.