శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. తాజాగా సినిమా నిర్మాతలు ఈ చిత్రం అక్టోబర్ 14న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ శర్వా, సిద్ధార్థ్ ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టిన పోస్టర్ ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి “మహా సముద్రం” మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. Read also…