యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరుపే ‘హుకుమ్’ మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనిరుధ్ ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్లో ఈ భారీ కచేరీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలై, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ, కచేరీ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలను అందించకుండా ఈ వేడుకను ప్రణాళిక చేసారని చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు…