మధ్యప్రాచ్య సంక్షోభం, తరిగిపోయిన దేశీయ నిల్వలు, తగ్గిన దిగుమతుల కారణంగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పరిమితంగా ఉన్న ఎల్పీజీని పొదుపు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ కంపెనీలు ఇప్పుడు 14.2 కిలోగ్రాముల సిలిండర్లలో గృహాలకు కేవలం 10 కిలోగ్రాముల ఎల్పీజీని మాత్రమే సరఫరా చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఎల్పీజీని పొదుపు చేయడం, వీలైనన్ని ఎక్కువ గృహాలకు దాని సరఫరాను కొనసాగించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యమని భావిస్తున్నారు.…
ఇప్పటి వరకు చోరీలు. దోపిడీలు ఖరీదైన వాటి కోసమో.. లేదంటే ఆభరణాల కోసమో, డబ్బు కోసం జరుగుతాయని వార్తల్లో.. టీవీల్లో చూశాం. కానీ ఇప్పుడు దొంగతనాలు కొత్త రూపం దాల్చాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు,…
భారత్ లో ఎల్పీజీ (LPG) సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్లు (Induction Cooktops) అమ్మకాలు భయంకరంగా పెరిగిపోయాయి. పశ్చిమ ఆసియా (వెస్ట్ ఆసియా)లో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు తీవ్రంగా ఆటంకపడ్డాయి. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు దేశం కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఇంకా కొనసాగితే ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మార్పు మరింత వేగంగా జరిగే…