Airtel: ఎయిర్టెల్ మినిమం రీఛార్జ్ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్ టైమ్. పైగా.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.