కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో దర్శనానికి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఉందన్నారు. స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గతంలో టికెట్లు పొందినవారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత అవకాశం కల్పిస్తామన్నారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు అటు ఆలయంలో తీర్థం, ఉచిత ప్రసాద…
శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. Read Also: తిరుపతి వాసులకు టీటీడీ…
సిరివెన్నెల పేరులో సీతారాముడున్నా, ఆయన మనసులో మాత్రం కైలాసవాసుడే కొలువై ఉన్నాడని చెప్పకతప్పదు. నుదుట త్రిపుండ్రాలు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కవిత్వం పలికించేవారు సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సరే, అలవోకగా పదబంధాలు పేర్చేవారు. తన కెరీర్ లో శివునిపై పలు పాటలు పలికించి పులకింప చేశారు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’లోనే “ఆది భిక్షువు వాడినేది కోరేది… బూడిదిచ్చేవాడినేది అడిగేది…” అంటూ నిందాస్తుతితో శివునిపై ఆయన పలికించిన గీతం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి…
ఈరోజు నుంచి కార్తికమాసం ప్రారంభం అవుతున్నది. సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు ఆయనాలు ఉంటాయి. దక్షిణాయణంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తికమాసం. కార్తికమాసంలో శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కార్తికమాసంలో దీపానికి ప్రాధాన్యత అధికం. ప్రతిఇంట ఉదయాన్నే లేచి తలస్నానం చేసి భక్తితో మహాశివునికి దీపం వెలిగిస్తారు. కార్తిక మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమిరోజున దేశంలోని శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. అరుణాచలంలో అగ్నిలింగేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. Read: నవంబర్ 5, శుక్రవారం దినఫలాలు… అరుణాచలంలోని…
దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతదర్శకుడే కాదు అద్భుతమై ఫోటో గ్రాఫర్ కూడా. తన కెమెరాతో ప్రకృతిని బంధించటం అంటే సరదా దేవిశ్రీకి. అంతే కాదు తను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్చే స్తుంటాడు. అలా ఇప్పటికే పలుసందర్భాలలో ప్రశంసలు కూడా అందుకున్నాడు. దేవికి దైవభక్తి కూడా మెండే. అదివారం దేవిశ్రీ ఆకాశంలో శివరూపాన్ని చూశాడు. ఆ రూపాన్ని కెమెరాతో బంధించి సోషల్మీ డియలో పోస్ట్ చేశాడు. దానికి చక్కటి క్యాప్షన్ కూడా జోడించాడు. శివ ఇన్ ద…