హరహర మహాదేవ శంభోశంకర.. అంటూ స్మరిస్తే నేనున్నానంటూ.. కదిలివచ్చే భోళాశంకరుడి పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ ఇంటిల్లిపాదికి చేకూరుతాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు స్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్ర పారాయణం చేయండి.
మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. 96 శైవ క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,225 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా కోటప్ప కొండకు పలు ప్రాంతాల నుంచి 410 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి 390 బస్సులు, కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు…