Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుమారు7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ED అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని రికార్డ్ చేశారు.. కొన్ని రికార్డ్ చేయకుండా వదిలేశారు.
లిక్కర్ స్కాం క్లైమాక్స్కి చేరింది. నాలుగు నెలలుగా లిక్కర్ స్కాంపై సిట్ విచారణ చేస్తోంది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుంచి కేసులో నిందితుల అరెస్ట్ మొదలు పెట్టింది. మొదటి కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ చెబుతోంది. ఒక సారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విచారించింది. కేసులో టెక్నికల్ ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచింది.