రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక విధానాన్ని ప్రారంభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.