Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య 2018-2022 మధ్య పెరిగినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో 13,874కి చిరుతల సంఖ్య చేరుకుంది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక చిరుతపులుల ఉన్నట్లు పేర్కొంది. ఈ రాష్ట్రంలో 3907 చిరుతలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1985), కర్ణాటక(1879), తమిళనాడు(1070) ఉన్నాయి.