పాలేరు నుంచి సాగర్ కాలువలకి గత నెలలో వచ్చిన వరదల వల్ల గండ్లు పడటంతో ఆ గండ్లని పూడ్చివేశారు. అయితే గండ్లను పూడ్చి నీళ్లు విడుదల చేసినప్పటికీ వెంటనే మళ్ళీ గండి పడింది. దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు. గత నెల 30 ,31 తేదీల్లో భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఈ వరదలు తో పాలేరు నుంచి దిగువకి నాగార్జునసాగర్ కాలువల కు గండ్లు పడ్డాయి. పాలేరు వద్ద ఒకే చోట…
కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్. Suicidal Behavior:…
పెట్టుబడులను ఆకర్షించేందుకు, అక్కడి మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలపై అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అధికారుల బృందంతో కలిసి శనివారం అమెరికా , జపాన్ల పర్యటనకు బయలుదేరారు. ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఉప ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) కె రామకృష్ణారావు, ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్, డిప్యూటీ సిఎం…
తెలంగాణ గుర్తింపు, ఆత్మగౌరవం కోసం పాటుపడిన తొలి తరం నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా తన మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ ఆశయ సాధన పట్ల అంకితభావంతో ఉన్నారని కొనియాడారు. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్లో తెలంగాణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి ఉన్నప్పటికీ, బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని తెలంగాణ ఉద్యమానికి వేదికగా ఎలా ఇచ్చారో…
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 1600 నుంచి 1800 మంది పేషేంట్స్ అనారోగ్యంతో వైద్యులని ఆశ్రయిస్తున్నారు. రెండ్రోజులకు మించి జ్వరం వస్తే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సలహా ఇస్తున్నారు. ప్రబలుతున్న విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విషజ్వరాల కారణంగా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చే వారిలో ఎక్కువగా విష జ్వరంతో పాటు…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలేల్మ గ్రామంలో విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులను అమర్చారు. అనంతరం కరెంటును అన్ చేసే క్రమంలో కరెంట్ (LC) తీసుకోకుండే విద్యుత్ లైన్ ను అన్ చేసే సందర్భంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ అవుట్…
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు మంత్రి సీతక్క. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించామని,…
యువత డ్రగ్స్ కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ముందుకు వెళ్లాలని మేడ్చల్ డిసిపి యువతకు పిలుపు నిచ్చారు.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసు లో భాగంగా ఈ రోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధి గా మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి హాజరయ్యారు.. ఈ పోటీలలో మెత్తం 8 ఎనిమిది టీం…