ముంబైలోని పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో గంటల కొద్దీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా రౌత్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం రౌత్ నివాసానికి చేరుకుంది.