హైదరాబాద్-బెంగళూరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఈ విషాద ఘటనలో 19 మంది సజీవ దహనమవ్వగా, ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక, బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. క్షేమంగా ఉన్న వారిని గుర్తించాం.. ఆస్పత్రిలో వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.…
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత…