బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు కేటీఆర్ సిట్ ముందు మరికాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్ళేముందు తెలంగాణ భవన్ లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు లు.. ఆతర్వాత కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు. మాకు ఏం సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. పదిసార్లు పిలిచినా హాజరవుతా..…
SIT Issues Notice to KTR: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకి రావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.
YS Jagan-KTR: సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలేకు మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్లోని నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్కో కొత్త యూనిట్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందన్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసిన గండిపేట ఉస్మాన్సాగర్ ల్యాండ్స్కేప్ పార్క్ను నేడు మంత్రి కెటి రామారావు ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు.