ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరుల కథ ఇది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతో దిక్కుతోచక ఊరికి వచ్చిన మనవడికి తాత ఓ హిత బోధ చేస్తాడు. కరువు కారణంగా గొర్రెలకు పశుగ్రాసం లభించకపోవడంతో వాటి కడుపు నింపడం కోసం ఊరిలోని పశువుల…