Interpol: భారత్-కెనడాల మధ్య ఖలిస్తాన్ అంశం చిచ్చు పెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. మరోవైపు కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు మాత్రం భారత విద్వేష వైఖరని మరింత తీవ్రతరం చేశారు. అక్కడ ఉండే హిందువులకు కెనడా విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇస్తున్నారు.