గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కవిత ట్వీటర్ వేదికగా స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు.