ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలల తరబడి మూతబడ్డాయి స్కూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులతో పాఠశాలలు సందడిగా మారాయి. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించరేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఐతే…అందుకు భిన్నంగా మొదటి రోజే 60 శాతం కంటే మించి విద్యార్ధులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడిబాట పడుతున్నారు పిల్లలు. తమ స్నేహితులను కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ…