లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 10 వరకు పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు.
ఉపాధ్యాయ సర్వీసు నిబంధనల రూపకల్పనలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ధర్నాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు వెల్లడించారు. అటు రాష్ట్రస్థాయిలో జూన్ 17 నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యానారాయణకు 11 డిమాండ్లతో కూడిన లేఖ రాశామన్నారు.…