MP: మధ్యప్రదేశ్లోని సాగర్లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి, మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తున్న తన భార్యపై ఫిర్యాదు చేశాడు. వేధింపులు, వివాహేతర బంధంపై కంప్లైంట్ ఇచ్చాడు. ఆ భర్త తన భార్యకు మంచి చదువును అందించి ఆమె కలలను నెరవేర్చాడు. కానీ ఆ మహాతల్లి నిర్వకం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.