ఇండోనేషియాలోని జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున బస్సు కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సెమెరు అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైంది. సెమెరు పర్వతం బద్దలవ్వడంతో ఆ పర్వతం వచ్చిన బూడిద సుమారు 11 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ పర్వతం దగ్గరలో బెసుక్ కొబొకన్ నది ఉన్నది. ఈ నది మొత్తం ఇప్పుడు బూడిద కుప్పలా మారిపోయింది. అంతేకాదు, ఈ ఆగ్రపర్వతానికి దగ్గరలో ఉన్న గ్రామాలు సైతం బూడిదతో కప్పబడ్డాయి. సెమెరు పర్వతానికి ఎటువైపు చూసినా కనుచూపు మేరలో బూడిద తప్పించి మరేమి కనిపించడం లేదు. Read:…