నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకేసులో నెల్లూరు జిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే సిగ్గుపడతాయేమో అన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా జిల్లా ఎస్పీ విజయారావు కట్టు కథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏం ఇనుము ఉందని దొంగలు అక్కడికి వెళ్లారు. కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు! కోర్టులోని రికార్డు రూములోని పత్రాలతో ఇనుము దొంగిలించే వ్యక్తలకు…