Israel Palestine War: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ మహాయుద్ధానికి సంబంధించి వివిధ దేశాలు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపై చేసిన క్రూరమైన దాడులను ఖండించిన ఒక రోజు తర్వాత, సోమవారం పాలస్తీనియన్లకు మద్దతుగా కాంగ్రెస్ బహిరంగంగా ముందుకు వచ్చింది.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు. వీటిలో కొన్ని కథలు ఆశ్యర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచర్యల్లో సంస్థల్లో మొసాద్ కూడా ఒకటి కావడం గమనార్హం.
హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మర�