మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరే జట్లపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 9 మందిలో ఏకంగా ఎనమిది మంది సన్రైజర్స్ హైదరాబాద్కు మద్దతు తెలిపారు. అడమ్ గిల్ క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్,…