సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'ఇంటింటి రామాయణం' చిత్రం స్పెషల్ షో ను ఈ నెల 5వ తేదీ కరీంనగర్ లో ప్రదర్శించ బోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ముందు అనుకున్నట్టు ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.