Dowry abuse: యూఏఈ షార్జాలో వరకట్న వేధింపులకు గురైన కేరళకు చెందిన మహిళ, తన బిడ్డను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లంలోని కుందార పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన ఒకటిన్నర ఏళ్ల కుమార్తె వైభవితో చంపి, తాను తనువు చాలించింది.