ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు, ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ -2025 ప్రకారం, చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది.
దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లోని బైసారన్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…