India issues advisory: ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. అంతకుముందు ఈరోజు హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఈ నేపధ్యంతో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది.