భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, 1947 ఆగస్టు 15న, భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తిని సాధించింది.
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవేస్తారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్దల్లా, ఆస్ట్రేలియాకు చెంది గుర్జంత్ సింగ్లతో సంబంధం ఉన్న నలుగురు మాడ్యూల్ సభ్యులను అరెస్ట్ చేశారు.