Israel Attack On Gaza : కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరుకుంది.
హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు.
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.
హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు సాగిస్తోంది. ఈ వారం జరిగించిన దాడుల్లో 200 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 140 రాకెట్ లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం పేర్కొంది.
గాజా, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది.
హిజ్బుల్లా, హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే ఆ రెండు గ్రూపులకు సంబంధించిన అగ్ర నేతలందరినీ ఐడీఎఫ్ హతమార్చింది. వాటి మూలాలే లేకుండా అంతమొందించాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగుతున్నాయి.
Israel–Hamas war: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ పొలిట్బ్యూరో సభ్యుడైన కసబ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది.
హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిమ్ బుధవారం తొలి ప్రసంగం చేశారు. మంగళవారమే హసన్ నస్రల్లా వారసుడిగా ఎన్నికయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో కాల్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే నడుచుకుంటానని ప్రకటించారు.
లెబనాన్లోని హిజ్బుల్లా యొక్క రద్వాన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ ముస్తఫా అహ్మద్ షాహదీ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ముస్తఫా అహ్మద్ షాహదీ ఇజ్రాయెల్పై అనేక తీవ్రవాద దాడులకు పురికొల్పినట్లుగా గుర్తించారు.