యూపీ కేడర్కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యవస్థలోని అవినీతిని ఎదిరించి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక నిజాయితీ గల అధికారికి పని చేసే అవకాశం ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. రాజీనామా వెనుక అసలు కారణం.. లక్నోలోని రెవెన్యూ బోర్డుకు బదిలీ అయిన తర్వాత తనకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించలేదని రింకూ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ…