IAS Officer: గుంజీలు తీసిన ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ కేడర్కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యవస్థలోని అవినీతిని ఎదిరించి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక నిజాయితీ గల అధికారికి పని చేసే అవకాశం ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
రాజీనామా వెనుక అసలు కారణం..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
లక్నోలోని రెవెన్యూ బోర్డుకు బదిలీ అయిన తర్వాత తనకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించలేదని రింకూ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ పనీ చేయకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం కూడా ఒక రకమైన అవినీతే’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే అవకాశం లేకుండా, కేవలం ‘అటాచ్డ్’ పోస్టింగ్తో ఖాళీగా కూర్చోబెట్టడం తన నైతిక విలువలకే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
గుంజీల ఘటన..
గత ఏడాది జూలైలో షాజహాన్పూర్లో ఎస్డీఎంగా ఉన్నప్పుడు ఒక వింత ఘటన జరిగింది. కార్యాలయ ప్రాంగణంలో మరుగుదొడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్న న్యాయవాదుల వద్దకు వెళ్లిన ఆయన, అక్కడి అసౌకర్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ అందరి ముందూ ఐదు గుంజీలు తీశారు. అంతకుముందు బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తితో కూడా ఆయన గుంజీలు తీయించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం ఆయనను తక్షణమే బదిలీ చేసింది.
మృత్యుంజయ పోరాటం..
రింకూ సింగ్ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 2008లో సాంఘిక సంక్షేమ అధికారిగా ఉన్నప్పుడు భారీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఏడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. దీనివల్ల ఒక కంటి చూపు పోయి, ముఖం వికృతంగా మారినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత కఠిన శ్రమతో యూపీఎస్సీ సాధించి ఐఏఎస్ అయ్యారు. అవినీతిపై పోరాడి బుల్లెట్లను సైతం ఎదుర్కొన్న అధికారికి, చివరకు వ్యవస్థలో పని చేసే స్వేచ్ఛ లేకపోవడం వల్ల తన అత్యున్నత పదవిని వదులుకోవాల్సి రావడం పాలనా వ్యవస్థలోని లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!