Home
Hyderabad
Hyderabad News
-
బ్లాక్ ఫంగస్ కలకలం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కీలక సూచనలు
కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తోన్న తరుణంలో.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.. దేశ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు కేసులు వెలుగుచూశాయి.. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఓ కేసు బయటపడింది. అయితే, బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కీలక సూచనలు చేశారు తెలంగాణ డీఎంఈ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్… ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్… -
లాక్డౌన్.. ఆ 4 గంటలే యమ డేంజర్..!
వరుసగా పెరిగిపోతోన్న కరోనా కేసులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా లాక్డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం… అయితే, ప్రజలకు కూరగాయాలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బందిలేకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు కల్పించింది.. కానీ, ఆ నాలుగు గంటలే ఇప్పుడు యమ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. ఎందుకంటే.. మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా.. భౌతిక దూరం పాటించడంలేదని.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. ఎగబడి మరి కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలు… -
బంగారం కొనేవారికి షాక్..మళ్ళీ పెరిగిన ధరలు
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల… -
అంబులెన్స్ లను ఆపడం దురదృష్టకరం… సజ్జల
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది. తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. అంబులెన్స్ ను… -
లాక్ డౌన్ నిబంధనలకు ప్రజలు కచ్చితంగా పాటించాలి…
తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు. సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను నిర్వహించారు. లాక్ డౌన్ ను ప్రజలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావొద్దని అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్ధనలు జరుపుకోవాలని తెలిపారు. మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇంట్లో జరిగే ప్రార్థనల్లో కూడా… -
తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్: ఉదయం నుంచి రద్దీ
తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు… -
ప్రజలు సహకరిస్తున్నారు…ఐడీ కార్డులు చూపిస్తే అనుమతిస్తాం-డిజీపీ
తెలంగాణలో ఈరోజు నుంచి లాక్డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కు కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల కార్మికులకు ఇబ్బంది ఉండదని, ఆయా కంపెనీల ఐడీ కార్డులను చూపిస్తే అనుమతి ఇస్తామని డీజీపి మహెందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని డిజీపీ తెలిపారు. ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడోద్దని,… -
లాక్ డౌన్ ఎఫెక్ట్: మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ…
తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అమలు జరగబోతున్న సంగతి తెలిసిందే. 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండబోతున్నది. రేపటి నుంచి లాక్డౌన్ కావడంతో మద్యం షాపుల వద్ద లిక్కర్ కోసం మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఒక్కసారిగా మందుబాబులు షాపుల వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. కరోనా నిబందనలు గాలికోదిలేశారు. భౌతికదూరం పాటించడంలేదు. ఎక్కడ మద్యం దొరకదో అని చెప్పి ఒక్కక్కరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉదయం 6గంటల నుంచి 10 గంటల… -
భారీగా తగ్గిన చికెన్ ధరలు…
మాములు రోజుల్లో సమ్మర్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్కు తగిన విధంగా సమ్మర్లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే… -
కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం…కరోనాపై కీలక నిర్ణయం తీసుకుంటారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!