Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి గన్ పార్క్ , సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంది. రేపు…
Miss World 2025: ఈనెల 10 నుండి 31 వరకు మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10 నుండి 31 వరకు ఈవెంట్ కొనసాగుతుందని, మెయిన్ ఈవెంట్ ఈనెల 10, 31 వరకు ఉండబోతుందని తెలిపారు. అలాగే వివిధ దేశాల నుండి వచ్చే అతిధులకు…
Miss World : హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్-2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6, 7 తేదీల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా…
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దిల్రాజు ఈ ప్రకటన చేశారు.
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది.
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.
ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు.…
Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత…
Orthopedic Walkathon: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద మూనట్ (Moonot) వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్థాన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ వాక్థాన్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. 3 కి.మీ, 5 కి.మీ, 7 కి.మీ వాక్థాన్ నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకూ కొనసాగింది. ఇందులో వివిధ వయసుల…
Numaish 2025 : ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే నుమాయిష్ ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) – 2025ను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ విహెచ్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా…