రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో హెబ్బా పటేల్ చెప్పే ‘నన్ను నేను చంపుకోబోతున్నాను’ అనే డైలాగ్ వ్యూవర్స్ లో ఉత్సుకతను రేకెత్తింప చేస్తోంది. హీరో రామ్ కార్తీక్…