భారతీయ సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ను ప్రకటించన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ.. తమ కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. అయితే, ఈ గౌరవాన్ని అందుకోవడానికి ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు. అభిమానులు, సినీ పెద్దలంతా…
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూత హిందీ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, అభిమానుల హృదయాలకూ భారీ షాక్ ఇచ్చింది. 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్కు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే…