అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 6 జిల్లాలో వరద నీరు పోటెత్తడంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. 24 వేల మంది కంటే ఎక్కువగా వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు అంచానా వేస్తున్నారు. అంతేకాకుండా వరదల ధాటికి ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. అస్సాంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేశాయి. దీనితో పాటు 12 గ్రామాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా…