ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసర నందినికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సన్మానం చేశారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి లక్ష రూపాయల చెక్ను నగదు ప్రోత్సాహకంగా అందించారు జగన్మోహన్ రావు.
ఆర్చర్ చికితకు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. అక్షర విద్యాసంస్థల నుంచి 10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందించారు. ఆర్చరీ వరల్డ్కప్, ఆసియాకప్కు ఎంపికైన పెద్దపల్లి యువ ఆర్చర్ టి.చికితరావుకు జగన్ మోహన్ రావు చేయూత అందించారు.