MI vs RCB: ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం నేడు మరో హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్ (MI), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య జరిగే ముఖాముఖి పోరుగా అభిమానులు భావిస్తున్నారు.…