కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.