పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగేటట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షోభంపై చర్చించేందుకు జీ 7 దేశాలు అత్యవసర సమావేశం అవుతున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.