ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు.