పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గ్రంధి శ్రీనివాస్.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు.