తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా (BioAsia) 2026 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 17 నుండి భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని హైటెక్స్ (HITEX) వేదికగా రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది సదస్సును ‘టెక్బయో అన్లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed –…