ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లో 55 స్థానాలకు, ఉత్తరాఖండ్, గోవాలో అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ప్రకారం గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ నమోదైంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 75.29 శాతం ఓటింగ్ రికార్డైంది. సాయంత్రం 5 గంటల వరకు ఉత్తరప్రదేశ్లో 60.44 శాతం, ఉత్తరాఖండ్లో 59.37 శాతం ఓటింగ్ జరిగింది. Read…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు…