గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) క్లిష్టమైన వ్యర్థాల నిర్వహణ సవాళ్లను పరిష్కరించడం ద్వారా నగర పరిశుభ్రతను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (SWM) కోసం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం ఆపరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అమలు చేయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించింది. వ్యర్థాల నిర్వహణ కోసం ICCC కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ,…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బ్యానర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి బ్యానర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..…
మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం…
హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. అయితే.. మూసీ పరీవాహక ప్రాంతంలో రేపటి నుంచి కూల్చివేతలు జరుగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. అయితే.. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో…
హైడ్రా అంటే జీహెచ్ఎంసీకి పడటం లేదా? రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందా? జీతాలిచ్చేవాళ్ళంటే… జోకై పోయిందా అంటూ గ్రేటర్ అధికారులు హైడ్రా సిబ్బంది మీద ఫైరైపోతున్నారా? అసలెందుకా పరిస్థితి వచ్చింది? రెండు విభాగాలు ప్రభుత్వ అధినంలోనే ఉన్నా… ఎక్కడ తేడా కొడుతోంది? మన తిండి తిని పక్కోడి చేలో పనిచేస్తున్నారన్న అభిప్రాయం గ్రేటర్ అధికారుల్లో పెరగడానికి కారణాలేంటి? గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు కబ్జా కాకుండా చర్యలు…
ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్కు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024…