Shailaja : ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్లో మరణించింది. ఆమె వాంకిడి గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థిని. అక్టోబర్ 31న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో రాత్రి భోజనం చేసి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన 63 మందిలో ఆమె ఒకరు. శైలజతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.…