England Currency: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆ దేశానికి కొత్తగా రాజైన కింగ్ ఛార్లెస్-3 ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లు 2024 మధ్య నుంచి చెలామణిలోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న పాలిమర్ నోట్లపై రాణి ఎలిజబెత్-2 ఫొటో1960 నుంచి కొనసాగుతోంది. ఆ నోట్లు మాసిపోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే సర్క్యులేషన్ నుంచి తొలగిస్తామని BOE వివరించింది.