EY Employee Death: ఎర్నెస్ట్ అండ్ యంగ్లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి ఎలా ఉంటుందనే విషయాలను ఆమె మరణం వెలుగులోకి తెచ్చింది. తన కూతురు ‘‘పని ఒత్తిడి’’తో మరణించిందని అన్నా తల్లి ఆరోపించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
EY Employee Death: అన్నా సెబాస్టియన్ పెరాయిల్ అనే 26 ఏళ్ల యువతి మరణం ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియాలో సీఏగా పనిచేస్తున్న అన్నా ‘‘పని ఒత్తిడి’’ కారణంగా మరణించిన ఘటన ఇప్పుడు కార్పొరేట్లో చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. ఆఫీస్ కల్చర్ యువ ప్రాణాలు ఎలా బలి తీసుకుందనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే దాన్ని వెలుగులోకి తెచ్చింది. కేరళకు చెందిన అన్నా, పూణేలో సీఏగా…